మండల నాయకులు ప్రహ్లాద చారి
వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం షురూ
సిరా న్యూస్,కౌతాళం;
వైసిపి పార్టీని గ్రామ ప్రజలు ఆదరించాలని సహకరించాలని మళ్లీ గెలిపించాలని మండల నాయకులు ప్రహ్లాద చారి, మరియు సచివాలయం మండల కన్వీనర్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీశ్రీ జగద్గురు ఖాదర్ లింగస్వామి దర్గాలో ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. అనంతరం
శాసనసభ్యులు బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం లో భాగంగా 14 వార్డ్ నందు ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ గత అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు మరల కొనసాగాలంటే మరల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలని అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మరల మా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ని మరల గెలిపించుకోవాలి. అని ఇంటింటికి ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్ ,దాట్ల సుబ్బరాజు,వైస్ ఎంపీపీ బుజ్జి స్వామీ,చౌదరి బసవ, ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య , చైర్మన్ వడ్డె రామన్న , ఉమాపతి, మాజీ సర్పంచ్ అవతారం,నాయకులు సమ్మధ్ ,రాజ్ హమ్మద్ ,ఈడిగ శివ, భిమేష్, ఉలిగప్ప,గిరి పూజారి తాత,వార్డ్ మెంబర్ రామకృష్ణ, యలీ ఖాసిం, కబ్బడి ఈరేష్, సుమన్ , మోద్దిన్ మరియు వడ్డే హుసేని , ఎన్టీఆర్ నగర్ వీరేశ్, పింజారి భాష తదితరులు పాల్గొన్నారు.