Agimalla Swami: డబ్బులు జమ చేసేంతవరకు పోరాడుతాం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
 డబ్బులు జమ చేసేంతవరకు పోరాడుతాం
* మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి అగ్గిమల్ల స్వామి
* మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేత‌
కాజేసిన ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసేంతవరకు పోరాడుతామ‌ని మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి అగ్గిమల్ల స్వామి అన్నారు. సోమ‌వారం మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పురపాలక సంఘం జిల్లా కమిషనర్ మొహమ్మద్ ఖమర్ హైమద్కి వినతి పత్రం అంద‌జేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి అగ్గిమల్ల స్వామి మాట్లాడుతూ రెండు నెలల పెండింగ్ వేతనాలు,9 నెలల పెండింగ్ ఇ.పి.ఎఫ్., ఈఎస్ ఐ పేరుతో కట్ చేసిన ఒక్క కోటి ముప్పై ఆరు లక్షలు కార్మికులకు చెల్లించుట, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు,డ్రైవర్లు, వాటర్ సప్లయ్ కార్మికులకు గత రెండునెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురైతున్నారు. వీరి యొక్క ఖాతాల్లో వెంటనే డబ్బులు వేయాలని కోరారు. గత రెండు నెలలుగా పెండింగ్ లో వున్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఈఎస్ ఐ నిధులు కోటి ముప్పై ఆరులక్షలు కాజేసిన వారిపై చర్యలు తీసుకోని, వెంటనే కార్మికుల ఖాతాలో జమచేయాలన్నారు. కార్మికులకు సంవత్సరానికి 15 సెలవులు సంవత్సరానికి హాజరుతో కూడుకున్నవి మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శులు, అగ్గిమల్ల స్వామి, దర్శనాల నాగేష్, జిల్లా నాయకులు ఎం.జనార్దన్, అజీమ్ , భారత్, మహేందర్, గగన్, రాజేశ్వర్, అంజి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *