Agriculture: కాండం తొలుచు పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి

చిగురుమామిడి, సిరా న్యూస్ 

మండల వ్యవసాయాధికారి 

కాండం తొలుచు పురుగుల నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి రంజిత్ రెడ్డి సూచించారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లోని పలు గ్రామాల్లో పంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పొలాలను పరిశీలించారు. పంటల్లో వస్తున్న రోగాలకు 3జీ గుళికలు 3 కిలోలు ఎకరానికి చల్లుకోవాలన్నారు. వరిలో సల్ఫేట్ ప్రభావంతో వచ్చే నష్టం నివారించుకోవాలన్నారు. జింక్ వాడకాన్ని తగ్గించుకోవాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలున్నా సంప్రదించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *