సిరాన్యూస్, చిగురుమామిడి
సుందరగిరి వారసంత టెండర్ ను దక్కించుకున్న ఐలేని కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే గొర్రె, మేకల వారసంతా టెండర్ ను హుస్నాబాద్ కి చెందిన ఐలేని కిషన్ రెడ్డి 3,03,000 (మూడు లక్షల మూడు వేలు ) రూపాయలకు దక్కించుకున్నారు. శనివారం సుందరగిరి స్పెషల్ ఆఫీసర్, మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వారసంత వేలంపాట నిర్వహించారు.వేలంలో 13 మంది పాల్గొన్నారు. కిషన్ రెడ్డి టెండర్ దక్కించుకోగా ఆయనకు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఐలేని కిషన్ రెడ్డి మాట్లాడుతూ వారసంత నిర్వహణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ మధుసూదన్, ఎంపీ ఓ శ్రవణ్ కుమార్, కార్యదర్శి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, వెంకటేశ్వర దేవస్థాన చైర్మన్ గందె సంపత్, ఎనగందుల లక్ష్మణ్, వంతడుపుల దిలీప్, మాజీ ఎంపిటిసి కాశ వేణి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.