సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ కి దక్కిన అరుదైన గౌరవం
ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా రాష్ట్ర పార్లమెంటులో ఆ రాష్ట్ర మంత్రి నాటలి హచిన్స్ శాలువాతో సన్మానించారు. ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా రాష్ట్ర పార్లమెంట్లో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా (ఐ సి ఎ వి) వారు భారత దేశ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాం నాయక్ ని విక్టోరియా రాష్ట్ర ఉద్యోగులు , పరిశ్రమల శాఖ మహిళా శాఖ ప్రీతి అండ్ ఫస్ట్ పీపుల్స్ శాఖ మంత్రి గౌరవనీయులు నాటలి హత్యస్ సన్మానించారు. అనంతరం చాలా సంవత్సరాల నుండి రేఖ నాయక్ చేస్తున్న ప్రజాసేవ అని (ఐ సి ఎ వీ) ప్రశంసిస్తూ రాసిన ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రాజ్ సైని, విక్టోరియన్ మల్టికల్చరల్ కమిషన్ రాజు, వేముల ఆస్ట్రేలియా లేబర్ పార్టీ నాయకుడు ప్రవీణ్, ఐసిఏవి జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.