AKULA Sambaiah: నేత్రదాత ఆకుల సాంబయ్య సంస్మరణ సభ

సిరాన్యూస్‌,ఓదెల
నేత్రదాత ఆకుల సాంబయ్య సంస్మరణ సభ
కుటుంబ స‌భ్యుల‌ను అభినందించిన సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి

పెద్ద పల్లి జిల్లా ఓదెలకు చెందిన‌ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తండ్రి ఆకుల సాంబయ్య నేత్రదానం చేశారు. బుధ‌వారం ఓదెల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో నేత్ర‌దాత ఆకుల సాంబ‌య్య సంస్మరణ సభను నిర్వహించారు. ఈసంద‌ర్బంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వ‌ర్యంలో వచ్చిన బంధు, మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై రాష్ట్ర ప్రచార కార్యదర్శి కె.యస్.వాసు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓదెల ఎంఆర్ఓ యక్కన్న , డీప్యూటీ ఎంఆర్ో మాట్లాడారు. నేత్రదాత కుమారుడు ఓదెల సర్పంచ్ గా ఉన్న మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గా 170 పైగా నేత్రదానాలకు ప్రోత్సహించడతో పాటు తండ్రి సాంబయ్య నేత్రదానం చేయడం స్పూర్తి దాయకమని కొనియాడారు. అలాగే సదాశయ ఫౌండేషన్ జ్ఞాపికను కుటుంబ సభ్యులకు అందజేసి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఉదయాదేవి, కుమారుడు సంజయ్ (,కరీంనగర్ ఎంపీడీఓ) కోడలు రమ , కుమారుడు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్‌ల‌కు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు , పృథ్విరాజ్, నరహరి, లగిశెట్టి చంద్రమౌళి, క్యాతం మల్లేశం. అల్లం సతీష్, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, సంతోష్ బైరి వినోద్ అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *