సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ లో హైదరాబాద్
ఇంట్రాడ్ సోచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధులైన కళాకారులచే సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల గొప్పదనం గురించి పాడిన పాటలు, ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాట, అలాగే బుల్లెట్ బండి పాట వింటూ విద్యార్థులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ చప్పట్లతో కళాకారులకి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా ఏదైనా పని చేయడానికి ధైర్యం లేక వెనకడుగు వేసే మనకన్నా, చూపు లేకపోయినా తమకున్న ఆత్మ విశ్వాసంతో వైకల్యాన్ని జయించి తమ కళను నలుగురికి ప్రదర్శిస్తున్న కళాకారులు అభినందనీయులు అని అన్నారు. అలాగే గత 28 ఏళ్ళుగా అనాథలు, అంధుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఇట్రాడ్ సోచ్ సంస్థ కృషిని అభినందిస్తూ, వారి కోసం మనందరం తోచిన సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, నవీన్, స్రవంతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు