సిరా న్యూస్;
యూపీ లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాలలో పెను విషాదం నింపింది. హథ్రస్ జిల్లాలో జరిగిన సత్సంత్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. రతిభాన్ పుర్ లో శివారాధన కార్యకమం సమయంలో ఒక్ససారిగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 126 మంది మృతి చెందారు. ఇది మట్టి రాసిన మరణశాసనం. మట్టి కోసం ఎగబడి.. ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఇది నమ్మకమా.. మూఢనమ్మకం అనే రేంజ్ దాటి.. పిచ్చి.. పైత్యం వరకు వచ్చింది. లేకపోతే.. ఓ బాబా పాదధూళి కోసం ఎగబడటం ఏంటి? అక్కడ తొక్కిసలాట జరిగి 120 మందికిపైగా మృతి చెందడం ఏంటి? ఇంతకీ యూపీలో అసలేం జరిగింది? జనాలు ఇంతలా వెర్రెక్కిపోవడానికి కారణమేంటి?తరతరాలుగా వస్తన్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అంటే ఓకే. కానీ వీటికి అమాయకత్వం.. నిరక్షరాస్యత.. అతి నమ్మకం తోడైతే.. హాథ్రస్ లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. లేకపోతే ఆయన పాదధూళి.. ఆయన కారు వెళ్లిన దారిలో మట్టి కోసం జనాలు ఎగబడటం ఏంటి ? అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 120 మందికిపైగా మృతి చెందడం ఏంటి ? నిజానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన దారుణం కాదు.. హత్యలు. ఇన్ని ప్రాణాలు తీసిన హంతకులు.. ఈవెంట్ను సరిగా నిర్వహించని ఆర్గనైజర్స్.. ఫేమ్ తప్ప.. ప్రజల ప్రాణాల గురించి ఆలోచించని భోలే బాబా.. ఇన్ని లక్షల మంది తరలివచ్చినా కనీసం అటువైపు చూడని ప్రభుత్వ వ్యవస్థలు. వీరందరిదీ తప్పే. వీరి నిర్లక్ష్యమే ఇప్పుడింత మంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది.బోలేబాబా భక్తుల్లో సమాజ్వాద్ పార్టీ నేత అన్వర్ సింగ్ జాతవ్ కూడా ఒకరు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భోలే బాబా ఆధ్వర్యంలో జరిగింది. మొదటినుంచి అసలు ఆయన బాబాయేనా? కాషాయ వస్త్రాలు ధరించకుండా కేవలం తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించే ఈ బాబా అసలు పేరు నారాయణ్ శకర్ హరి. యూపీలోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామం. హరి భార్య మానవ్ మంగళ్ మిలాన్ సద్భావన సమగం పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతంలో తాను ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు చెప్పుకున్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి గాంచిన ఈ హరి.. కాషాయం దుస్తులు ధరించడు. కేవలం తెలుపు రంగులో ఉండే దుస్తులు మాత్రమే ధరిస్తాడు. సంపాదించిన డబ్బునంతా తన భక్తుల కోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పాడు. ఇక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పని చేసినప్పుడు కూడా తాను ఆధ్యాత్మికంలో మునిగి తేలేవాడినని తన భక్తులకు వివరిస్తుంటాడు. తనలో నింపుకున్న ఆధ్యాత్మికతను అందరికీ పంచాలనే ఉద్దేశంతో 1990లో ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడ్డారు.గతంలోనూ ఈ భోలే బాబా పలు ఈవెంట్లు నిర్వహించి కటకటాలపాలయ్యాడు. 2022 మే నెలలో కోవిడ్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరిగా ఓ ఆరాధన కార్యక్రమం నిర్వహించాడు. కరోనా నిబంధనలు కూడా ఉల్లంఘించాడనే కారణంగా భోలేబాబాపై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు కేవలం 50 మందికే అనుమతి ఇస్తే ఆయన 50 వేల మందికి అనుమతించాడు. ఇక ఈ భోలే బాబు తన సొంత కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్లు , తన ప్రసంగాలను ప్రచారం చేసుకోవడానికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ కు దాదాపు 30 వేల మందికి పైగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. .బోలే బాబాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అతను ఇప్పటి వరకు భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు, దక్షిణలు, కానుకలను తీసుకోలేదు. కానీ, ఉత్తరాదిలో అనేక ఆశ్రమాలను ఎలా స్థాపించాడు అనే విషయం ఎవరికీ బోధపడకుంది. ఉత్తరప్రదేశ్లోనే వేరువేరు ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే భక్తులకు కనిపించేవాడు. పైజామా కుర్తా, ప్యాంట్ -షర్ట్, సూట్లలో ఎక్కువగా కనిపిస్తాడు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోగానీ, ఇంటర్నెట్లో గానీ ఇతని గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం మరో విచిత్రం. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు లక్షలాది భక్తులున్నారు. అతను నిర్వహించే కార్యక్రమాల్లో వందలమంది వలంటీర్లు ఉంటారు. వీరు భక్తులకు ఉచితంగా నీళ్లు, ఆహారం పంచడం నుంచి రద్దీని నియంత్రించేంత వరకు అన్నీ వారే చూసుకుంటూ ఉంటారు. ఈయనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీలో భక్తులు ఉన్నారు. భోలే బాబా ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.జులై 2వ తేదీన చోటు చేసుకున్న తాజా ఘటనతో భోలే బాబాపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.2006లో వీఆర్ఎస్ తీసుకుని భోలేబాబాగా అవతారం ఎత్తిన ఈయన . తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలే బాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా.. ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఇతడికి ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. తన భక్తులకు బోధనలు ఇచ్చేందుకు ప్రతి ఏటా సత్సంగ్ పేరుతో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తాడు భోలే బాబా. ఈ సత్సంగ్లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చుని బోధనలు అందిస్తాడు భోలే బాబా. కార్యక్రమం చివర్లో బాబా అనుచరులు భక్తులకు జలాన్ని పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర జలం తీసుకుంటే రోగాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సంత్సంగ్కు లక్షల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా.. 50వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు భోలే బాబా.ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గత రెండేళ్లుగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..బాబా అనుచరులు. ఈ ఏడాది రతిభాన్పూర్లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రచారం కూడా నిర్వహించారు. ఊరూరా పోస్టర్లు అంటించారు. అయితే ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా.. పోలీసుల నుండి గానీ, అధికార యంత్రాంగం నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు నిర్వాహకులు. అటు అధికారం యంత్రాంగం కూడా ఈ బాబా వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించింది. భక్తుల తాకిడితో స్థానికంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలింది. అటు నిర్వాహకులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో పెనువిషాదం చోటుచేసుకుంది. అయితే ఈ భోలేబాబా వెనుక ఉన్న బలమైన రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నాయా? యూపీ అధికార యంత్రాంగా నుంచి వీరికి ఎలాంటి సాయం అందుతోంది. దీనిపై యోగి ఆధిత్యనాధ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.
===========================