సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలి*

క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎలాంటి ఘటనలకు తావులేకుండా ఎన్నికలు జరిగేలా ప్రణాళికా బద్దంగా బందోబస్తు ఏర్పాటు చేయాలి

కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్

 సిరా న్యూస్,బద్వేలు;
రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధం కావాలని, ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు. బద్వేలు పట్టణం లోని మునిసిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో రెండో దశ వర్క్ షాప్(శిక్షణా కార్యక్రమం) నిర్వహించారు. చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ఎస్.పి గారు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ క్రిటికల్(క్లిష్టతర / సమస్యా త్మక) పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మద్యం, నగదు తో ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రబుల్ మాంగర్లు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని సమస్యల గురించి ముందస్తు సమాచారం సేకరిస్తుండాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో మైదుకూరు డి.ఎస్.పి వెంకటేశులు, సి.ఐ లు, ఎస్.ఐ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు, స్పెషల్ బ్రాంచ్, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *