సిరా న్యూస్,చేవెళ్ల;
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎవరికి ఓటు వేయాలో ఎప్పుడో సిద్ధపడ్డారని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ , వివేకానంద నగర్ డివిజన్ మీదుగా కూకట్ పల్లి డివిజన్ లో భారీ రోడ్డు షో నిర్వహించారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ నకిలీ వారేనని ప్రజలలో మోడీ నాయకత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని అందరికీ తెలుసు అని అన్నారు
మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.