కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్
సిరా న్యూస్,కరీంనగర్;
మాజీ ఎంపి సోమవారం నాడు బోయినపల్లి మండలం నర్సింగాపూర్ లోని సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు జరిపారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామమందిరం నిర్మాణం చేయడం గొప్ప పరిణామం. రాములవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు.
ఇతిహాసాలలో అతి పూరాతమైన ఇతిహాసం రామాయణం, మహాభారతమని పేర్కొన్నారు. చరిత్రలో కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఆలోచనలు, ఆ కాలంలో ఉన్నటువంటి మానవజాతి జీవితం వంటి అంశాలను క్రోడీకరించి రామాయణం, మహాభారతం గ్రంథాలు రచించడం జరిగిందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి, అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేయడం గొప్ప పరిణామమని అన్నారు. మానవజాతిలో పురుషుడు ఎలా ప్రవర్తించాలో అని చెప్పడానికి రాముడు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ సాగర్ రావు, జోగినపల్లి అజిత్ కుమార్, ఆదిత్య, సంపత్ రావు,మాజీ సర్పంచ్ లక్ష్మీరాజం, ఉపసర్పంచ్ కావేరి, జిత్తెందర్ రావు, ప్రకాష్ రావు, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.