వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్

 సిరా న్యూస్,విజయవాడ;
వైకాపా హయంలో వున్న వారంతా దండు పాళ్యం బ్యాచని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది. అందుకే.. ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారు. జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా… ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా. అవినీతి చేశారు కాబట్టే.. వివిధశాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టపెట్టారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. జగన్ ను చూసి భయపడి.. ఒక్కరూ కూడా ఏపీకి రాలేదు. ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడి దారులు మళ్లీ ఏపికి వస్తున్నారుప సిగ్గుండాలి.. మేము చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవడానికి. జోగి రమేష్ భూబాగోతం చూశాం.. అటాచ్ ఆస్తులను కూడా స్వాహా చేశారు. వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయి. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారు.. ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారు. పలానా శాఖలో మేము దోచుకోలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఏ శాఖ పేరు చెప్పినా.. నేను చర్చకు సిద్దం. అసలు ప్రభుత్వ శాఖల్లో కీలక ఫైళ్లు దగ్దం ఏమిటో వింతగా ఉంది. ఎవరికీ అర్దం కాని జగన్ ఆర్ట్ ఇది.. దొరక్కుండా తగల పెడుతున్నారు. చేసిన అవినీతి బయట పడకుండా ఉండాలని ఈ పైళ్లు దగ్దం చేస్తున్నారు. గతంలో వైయస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూలు కట్టబోతున్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు, ఐఎయస్, ఐపీయస్, ఇతర అధికారులకు శిక్ష తప్పదు. నేను వేసిన ఛాలెంజ్ కు ఎవరైనా దమ్ముంటే ముందుకు రండి. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుంది. ఆ విషయం ప్రజలకు అర్దమైంది… వైసీపీ మూర్ఖులకే అర్దం కావడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *