సిరాన్యూస్, ఓదెల
రాష్ట్ర యువజన విభాగంలో అధికార ప్రతినిధిగా అల్లం సతీష్
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం యువజన విభాగంలో శుక్రవారం ఓదెల మండల కేంద్రానికి చెందిన అల్లం సతీష్ పురగిరి క్షత్రియ పెరిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా యువజన రాష్ట్ర అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ , రాష్ట్ర కమిటీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్దే లింగన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా ఎన్నికకు కృషి చేసిన దొంగరి మనోహర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పెరిక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషిచేసిన ముత్తినేని వీరయ్యకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ పెరిక సంఘం అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. పెరిక కుల సంఘ కార్యక్రమాలలో అంకిత భావంతో నీతి నిజాయితీ నిబద్దత తో. క్రమశిక్షణ చిత్త శుద్ధితో వ్యవహరిస్తానని తెలిపారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని బాధ్యతలకు సరైన న్యాయం చేస్తానని ఆయన అన్నారు . రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.