మనిషి జీవనవిధానానికి దిశా నిర్దేశం చూపేదే పంచాంగం

-క్రోధినామ సంవత్సర నూతన పంచాంగం ఆవిష్కరించిన ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

-క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

సిరా న్యూస్,మంథని;

మనిషి జీవనవిధానానికి దిశా నిర్దేశం చూపేదే పంచాంగం అని రాష్ట్ర ఐటి, సాంకేతిక, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
క్రోధి నామ సంవత్సర నూతన ఉగాది పంచాంగమును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కేంద్రంలో సోమవారం న్యాయవాది శశిభూషణ్ కాచె ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
బ్రహ్మశ్రీ గాడిచెర్ల నారాయణ సిధ్దాంతి మనుమడైన బ్రహ్మశ్రీ గాడిచెర్ల నాగేశ్వరరావు సిధ్దాంతి చే గుణించబడిన క్రోధి నామ సంవత్సర పంచాంగమును జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మద్రణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తిథి, వార, నక్షత్రము, యోగం, కరణంలతో కూడిన పంచాంగం మనలో ఉండే మేధాసంపత్తిని ప్రజ్వలింపజేస్తాయన్నారు.
తెలుగు పంచాంగంలో వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారనీ… ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగానదిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని చాలా మంది విశ్వసిస్తారన్నారు. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని అందించాలనీ…రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మంథని యంపిపి.కోండ శంకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *