సిరా న్యూస్,కొత్తకొండ
కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఆల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి
హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని బుధవారం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించారు. ఈసందర్బంగా అర్చకులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఈఓ కిషన్ రావు స్వామివారి చిత్రపటాన్నీ అందజేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త కొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు ఆల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు.