సిరా న్యూస్,అమలాపురం;
రధసప్తమి పురస్కరించుకుని ఎన్నికల ప్రచారం అమలాపురం టీడీపీ ఇంచార్జి అయితబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఇందుకోసం అయన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార రథం సిద్ధం చేసారు. రథసప్తమి సందర్భంగా అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి టీడీపీ ఇంఛార్జి అయితాబత్తుల ఆనందరావు తీసుకెళ్లుతున్నారు. గత రెండు ఎన్నికల నుండి ఎన్నికలకు సెంటిమెంట్ గా రధసప్తమి రోజున ప్రచార రథాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకా టిక్కెట్ కేటాయించకపోయినప్పటికి అటు జనసేన, టీడీపీ నేతలు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. నేతల తీరుతో టీడీపీ, జనసేన కేడర్ అయోమయంలో ఉంది.