జగన్ నివాసానికి వెళ్లిన అమరావతి రైతులు

సిరా న్యూస్,అమరావతి;
అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జగన్ నివాసం గాంధీగిరి చసారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు.. ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చామని అన్నారు. కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్ కి ధన్యవాదాలు చెబుదామని వచ్చామని అన్నారు. జగన్ వల్లే ఉద్యమాలు చేయడం నేర్చుకున్నాం. ఇంట్లో ఉండి గరిటెలు తిప్పే తమకు జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేన్న మహిళా రైతులు అన్నారు. జగన్ ను కలిసి స్వీట్స్, మామిడి, అరటి పండ్లు, తాంబూలం ఇచ్చేందుకు వచ్చామన్న మహిళా రైతులు వెల్లడించారు. భద్రతాసిబ్బంది వారిని అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదని ఆపివేసారు. సెక్యూరిటీ సిబ్బందితో రాజధాని మహిళా రైతుల వాగ్వాదానికి దిగారు. అరగంటపాటు జగన్ అపాయింట్ మెంట్ కోసం వేచివున్న రైతులు, స్పందన రాకపోవడంతో వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *