సిరా న్యూస్, కడెం
మహిళ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి : అమరవేణి నర్సాగౌడ్
* నిజ నిర్ధాన కమిటీ సభ్యుల పరామర్శ
మహిళ పై అత్యాచార యత్నం, హత్య యత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్ద బెల్లల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పర్ గూడంలొ ఈనెల 20 న గౌడ మహిళ పై అత్యాచార యత్నం, హత్య యత్నం వారి బంధువుల పై హత్య యత్నం జరిగిన సంఘట పై శనివారం ప్రజా సంఘాల నిజ నిర్ధాన కమిటీ గా వెల్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈసందర్బంగా మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురస్తు శంకర్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ రాజేందర్ గౌడ్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు ఓల్లెపు తిరుపతి, మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, పంజాల రామా గౌడ్లు మాట్లాడారు. నిర్మల్ జిల్లా కడం మండలంలోని పెద్ద బెల్లల్ గ్రామ పంచాయతీ లోని ఎస్సీ కాలనీకి చెందిన మచ్చా చింటు, మచ్చ ప్రభాకర్, అరికెల ప్రభాకర్, సాగర్, మనోహర్లతో పాటు మరికొందరు వ్యక్తులు చంటి పిల్ల తల్లి వెంగాల లావణ్య గౌడ్ అనే మహిళ అంగన్వాడీ స్కూల్ కు కోడి గుడ్ల కోసం వెళ్తుందన్నారు. ఈ క్రమంలో వీరు మద్యం మత్తులో లావణ్య గౌడ్ ను వేధించి చీర లాగుతు బలవంతం చేశారు. అటుగా వస్తున్నా ఆటోలో ఎక్కి అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని టీచర్, ఆయాకు తెలిపారు. అయిన మత్తులో ఉన్న వ్యక్తులు వెంబడించి టీచర్ సమక్షంలోనే చంటి పిల్ల తల్లి పై మళ్ళీ దాడి చేస్తు అక్కడికి వచ్చిన వారి బంధువులను కొట్టి తీవ్రంగా గాయపర్చారు. లావణ్య గౌడ్ పై అత్యాచార యత్నం, హత్య యత్నానికి పాల్పడడంతో ప్రాణభయంతో ఆమె చెరువు తూములో దక్కోవడం జరిగింది. దాదాపు 1 గంటకు పైగా దాడి చేసి కుటుంబసభ్యులను తీవ్రంగా గాయపర్చారు. అక్కడికి పోలీస్ లు రావడంతో ప్రాణాలతో బయట పడటం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి అత్యాచార యత్నం, హత్య యత్నం నేరం కింద కేసులు నమోదు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. భవిష్యత్తులో ఈలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమం వివిధ కుల సంఘాల నాయకులు కొండా మురళి గౌడ్, బొంగోని శేఖర్ గౌడ్, జాగిరి శ్రీనివాస్ గౌడ్, పోడేటి మల్లేశం, కైరం సత్య గౌడ్, రాజేష్, రమేష్, ఆధార్స్ లతో గ్రామ మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.