Ambedkar Mahaparinirvan Programme at Jainath: అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలి..

సిరా న్యూస్, జైనథ్‌:

అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలి..

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిద గ్రామాల్లో బుధవారం అంబేడ్కర్‌ వర్ధంతిని జరుపుకున్నారు. దళిత సంఘాలు, వివిద పార్టీల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైనథ్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహాని ఈ సందర్భంగా అంబేడ్కర్‌ యువజన సంఘం, మాల సంక్షేమ సంఘం అధ్వర్యంలో పూలమాలలు వేసి నిళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దుమాల దేవన్న, నాయకులు లింగన్న, సంజీవ్, రాళ్లబండి శ్రీకాంత్, చిల్క చిన్నన్న, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *