సిరా న్యూస్, ఆదిలాబాద్:
విద్యతోనే నాణ్యమైన జీవితం…
బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల బ్రతుకులు మారలంటే విద్యతోనే సాధ్యమని అంబేడ్కర్ ఉచిత విద్య సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరం పొచ్చన్న, సోపన్రావ్లు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్లోని నిరుపేద విద్యార్థులకు ఉచిత తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ కలలుగన్న సమాజం, కేవలం విద్యతోనే సాధ్యమని అన్నారు. అనంతరం నిరుపేద చిన్నారులకు పెన్నులు, పెన్సిళ్లు, నోటు పుస్తకాలు అందించారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు విస్తరింపజేస్తామని వారు అన్నారు. వీటితో పాటు ఉచితంగా వివిద ఉద్యోగాలకు శిక్షణ తరగతులు సైతం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.