AMC Jainath: లైసెన్స్ లేకుండా పంటలు కొనుగోలు చేస్తే కేసులు తప్పవు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

లైసెన్స్ లేకుండా పంటలు కొనుగోలు చేస్తే కేసులు తప్పవు…

మార్కెట్ కమిటీ జారీచేసిన లైసెన్స్ లేకుండా ఎవరైనా రైతుల వద్ద నుండి సోయాబీన్, పత్తి, కందులు, శనగలు, వంటి పంటలు కొనుగోలు చేయడం నేరమని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రైతుల వద్ద నుండి లైసెన్స్ లేకుండా పంటలు కొనుగోలు చేస్తే, వారిపై మార్కెట్ కమిటీ రూల్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *