సిరా న్యూస్, జైనథ్:
సోయా కొనుగోళ్ళకు బ్రేక్
+ ప్రకటన విదుదల చేసిన కార్యదర్శి గంగన్న
+ 27-29 కొనుగోళ్ళు బంద్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మమండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సోయా కొనుగోళ్లకు మొదటి రోజే బ్రేక్ పడింది. శనివారం సోయ కొనుగోళ్ల కోసం మార్కెట్ యార్డ్లో పూజలు నిర్వహించారు. కాగా సోమవారం నుండి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే వాతావరణం సహకరించకపోవడంతో ఈ నెల 27 నుండి 29వరకు సోయా కొనుగోళ్లు నిలిపివేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం కార్యదర్శి గంగన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మరల కొనుగోళ్లు ప్రారంభించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, రైతులు గ్రహించి సహకరించాలని ఆయన కోరారు.