ఏబీవీపీ నేతల అందోళన..అరెస్టు

 సిరా న్యూస్,హైదరాబాద్;
సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే మరొకవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్న వైనం. ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుంది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ,ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలోసర్కార్ విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేసారు. విద్యార్థులు పోలీసులకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *