సర్పంచుల అందోళన

సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు కలెక్టర్ కార్యాలయంవద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం ధర్నా కు దిగింది. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్, జిల్లా రాష్ట్ర, నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లే క్రమంలో పోలీసులకు సర్పంచులకు వాగ్వివాదం జరిగింది. సర్పంచులు బారికెట్లను తోసుకొని కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా గ్రామాలలో అభివృద్ధి పనులు ఏమి చేయలేక రోడ్లు డ్రైన్స్ తాగునీరు వీధి దీపాలు మొదలగు అభివృద్ధి పనులు ఏమీ చేయకుండా పంచాయతీ నిధుల్లో నుండి వైసీపీ ప్రభుత్వం సొమ్ము కా చేసిందని, 14 15 ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి సొంత పథకాలకు వాడుకుంటుందని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *