సిరా న్యూస్,జూలూరుపాడు;
తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ రాస్తారోకో వినోబా నగర్ లో నెల రోజులుగా తాగునీటి సరఫరా కాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మండిపడ్డారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. గత నెల రోజులుగా గ్రామంలో తాగునీరు సరఫరా కాకపోవటంతో ప్రజలు అగ్రహం చెంది రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకును నిర్మించినప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవటంతో అది అలంకారప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ నెలరోజులుగా గ్రామంలో నేటి సరఫరా నిలిచిపోయింది.
నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జీవన్ రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకాలకు నచ్చజెప్పి ధర్నను విరవింపచేసారు.