సిరాన్యూస్, సెట్టూరు
అనాథ పిల్లలకు రూ.20వేలు అందజేసిన అమిలినేని సురేంద్ర బాబు
శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన తిమ్మరాజు ఇటీవల కాలంలో బెంగళూరుకు బతుకుదెరువు కోసం వెళ్లాడు. చాలా రోజులైనా తిమ్మ రాజు తిరిగి రాకపోవడంతో అతని భార్య చంద్రకళ భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తూ గుండె పోటుతో ఇటీవల మృతి చెందింది. వారికి ఉన్న ముగ్గురు చిన్న పిల్లలు అనాథులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆ పిల్లలకు తక్షణ సహాయం కింద రూ. 20,000 శెట్టూరు మండల నాయకులు, ఐదుకల్లు గ్రామ నాయకుల ద్వారా శుక్రవారం అందజేశారు. ఆ పిల్లల కు సురేంద్ర బాబు అన్నివేళలా అండగా ఉంటారని నాయకులు తెలిపారు. ఎటువంటి సహాయానికైన వెనకడుగు వేయమని , పిల్లల చదువుల విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని మండల నాయకులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.