సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఢిల్లీలో చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
ఎన్డీఏ కూటమి మీటింగ్ కు హాజరైన టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను శుక్రవారం ఢిల్లీలోకళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు తాజా రాజకీయ విశేషాలు వారు చర్చించుకున్నారు. అఖండ మెజార్టీతో గెలిచిన సురేంద్రబాబును నారా చంద్రబాబునాయుడు అభినందించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు అంత చాలా చక్కగా పనిచేశారన్నారు. సురేంద్రబాబు తో పాటు ఆయన తనయుడు అమిలినేని యశ్వంత్ చౌదరి, టీడీపీ నాయకులు రాజగోపాల్ కూడా చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుతో పాటు మాజీ ఎంపీ గళ్ళ జయదేవ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు, సురేంద్రబాబు ఇరువురు కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అవ్వడం, కళ్యాణదుర్గానికి సురేంద్రబాబు ఎమ్మెల్యే అవడం అభివృద్ధికి నాంది అంటూ ప్రజానికం అభిప్రాయపడుతున్నారు.