సిరాన్యూస్, కళ్యాణదుర్గం
సీఎంను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా త్వరితగతిన బీటీపీ కాలువ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.