కొనసాగుతున్న గాలింపు

సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణాజిల్లా నర్సాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 4 వ రోజు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న మండల వెంకటరమణారావు గారి అదృశ్యమైన నేపథ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈరోజు 2 ఎన్డీఆర్ఎఫ్ F బృందాలు,మూడు ఎస్డీఆర్ఎఫ్ F బృందాలు కలిపి మొత్తం 50 మంది సిబ్బందితో 5 బొట్ల సహాయంతో, మరియు కేసరపల్లి నుండి హనుమాన్ జంక్షన్ పెరికీడు వంతెన వరకు గన్నవరం కేసరపల్లి వరకు ప్రవహించే నది ప్రవాహం వరకు, దానితోపాటు బుడమేరు వాగు పరిధి కలిపి గాలింపు చేపట్టారు. నదిలో పలుచోట్ల గుర్రపుడెక్క అధికంగా ఉండడంతో, గాలింపు చర్యలు ఆలస్యం కాకుండా ఉండటానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం తీసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *