సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు పిల్లి వాని లంక కృష్ణా నది పాయలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సుమారు పది రోజులు క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం. మృతుడి వంటిపై దుస్తులు లేవు. మృతుడి సమీపంలో లుంగి, చెప్పులు ఉన్నట్లు గమనించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.