సిరాన్యూస్, గాదిగూడ
సుగుణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం
* పార్లమెంటరీ కోఆర్డినేటర్ సెడ్మాకి ఆనందరావు
ఆదివాసులను గుర్తించి టికెట్ కేటాయించినందుకు సుగుణను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్, పార్లమెంటరీ కోఆర్డినేటర్ సెడ్మాకి ఆనందరావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా లోని గాదిగూడ మండలం కొమురం భీమ్ చౌక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసి ముద్దుబిడ్డ అయినటువంటి ఆత్రం సుగుణకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి సీతక్కకి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కి ధన్యవాదాలు తెలిపారు.బిజెపి పార్టీ జీవో నెంబర్ త్రీని తొలగించి ఆదివాసులకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. కేవలం కాంగ్రెస్ హయాంలో ఆదివాసులకు ట్రైబల్ బెటాలియన్ ఏజెన్సీ డీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులను కేటాయించి ఆదివాసుల అభివృద్ధికి పాటుపడిందన్నారు. సుగుణను ఆదిలాబాద్ ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కా శేషరావు, మాజీ సర్పంచ్ మోహన్ రావు , కాంగ్రెస్ సీనియర్ నాయకులు , మండల ప్రెసిడెంట్ గెడం పరశురాం , కొట్నక్ లింభా రావు, మండల ఆదివాసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ యం నాగొరవ్ , నాయకులు పాల్గొన్నారు.