కొట్టుకుపోయిన అందవెల్లి తాత్కాలిక వంతెన..

నిలిచిన రాకపోకలు
సిరా న్యూస్,కాగజ్ నగర్;
కాగజ్నగర్ మండలం అందవెల్లి వద్ద గల పెద్దవాగు బ్రిడ్జ్ తాత్కాలిక వంతెన రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజుమున కొట్టుకుపోయింది. దీంతో దహేగాం- కాగజ్నగర్ మండలాలలోని దాదాపుగా 42 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.సోమవారం ఉదయానికి కుడా ఆదే పరిస్థితి. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జ్ రెండు పిల్లర్లు కూలిపోయాయి. దీంతో నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు ఆలస్యం అవుతుండటంతో ప్రజలు తాత్కాలిక వంతెనను రాకపోకలకు ఉపయోగిస్తున్నారు.ఈ వంతెన తెగిపోవడంతో ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు ప్రజల రాకపోకలకు కష్టాలు తప్పేలా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *