సిరా న్యూస్;
ఎమ్మెల్సీ కవిత కుంటిసాకులు చెప్పడం సిగ్గుచేటు
మహేందర్ రెడ్డి హయాంలో లక్ష కోట్లు అవినీతి జరిగిందని కవిత ఒప్పుకుంటున్నారా!
మరి..గత ప్రభుత్వంలో ఎన్నికోట్ల అవినీతి జరిగినట్లు ?
కల్వకుంట్ల కుటుంబంపై ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీ కోరాలి
తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరాశోభన్ డిమాండ్
అందెశ్రీ దళితుడు కావడం వల్లే ఆయన రాసిన పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షులు ఇందిరాశోభన్ అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని ఉద్యమ సమయంలో చెప్పినా..ఒక దళితుడు రాసిన పాట రాష్ట్ర గీతం కావడం ఇష్టం లేకనే కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఇపుడు.. ఎమ్మెల్సీ కవిత కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఇందిరాశోభన్ ఆరోపించారు. రాష్ట్ర గీతంపై గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఇందిరాశోభన్ ఖండించారు. స్వరాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్, వారి ఆత్మగౌరవాన్ని అవమానించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా స్ఫూర్తి నింపిన అందెశ్రీ పాటకి..రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదిన్నరేళ్ల కాలం అధికారంలో ఉండి. ఏ ఒక్కనాఁఫు ఆలోంచించలేదు..గుర్తించలేదని అన్నారు. దళితులపై కల్వకుంట్ల కుటుంబానికి ఏనాడు గౌరవం లేదని అన్నారు. దలితుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్, దళితులకు మూడెకరాలు, ఉద్యోగాలు..ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేస్తూ వచ్చారని అన్నారు. అదెశ్రీ పాటకు పట్టం కట్టి..రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే.. మీరెందుకంత అక్కసు వెళ్లగకుతున్నారని ఆమె ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకంతోపాటు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటూ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్ ఎంక్వైరీ కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డీజీపీగా మహేందర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని నమ్మితే..గత ప్రభుత్వంలోనూ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకున్నట్టేనని అన్నారు. అలా అయితే.. కల్వకుంట్ల కుటుంబంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ కోరాలని ఇందిరాశోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.