సిరా న్యూస్, కుందుర్పి
రుద్రంపల్లిలో రెండు గడ్డివాములు దగ్ధం
*రూ.60 వేల ఆర్థిక నష్టం
మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమల్ దొడ్డి గ్రామపంచాయతీ పరిధిలో రుద్రం పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం 9,30 నిమిషాలకు సమయం రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. పశువుల మేత కోసం నిలువ ఉంచిన రెండు గడ్డివాములు గడ్డి కాళీ బూడిదయింది. గడ్డివాములు పక్కన ఉన్న పశువులను తప్పించారు.దీంతో సుమారు 60 వేల రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనకు గుర్తుతెలియని వ్యక్తులు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.