డిసెంబర్ 8న అంగన్వాడీ సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8న అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు , మండల కార్యదర్శి బి రాముడు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి గోవర్ధనమ్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్లో సెక్టార్ నాయకురాలు ఎస్ అరుణమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాటిటీ పెన్షన్ సాధనకై పోరాటం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓవైపు తమ సమస్యలపై అధికారులకు  వినతి పత్రాల ద్వారా, వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా ఆందోళన చేపట్టిన ఎటువంటి చర్యలు ఏమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 8న పెడుతున్నట్టు తెలిపారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో సిఐటియు తో పాటు ఏఐటియుసి   ఐఎఫ్టియు సంఘాల్లో పని చేసే కార్యకర్తలు  పాల్గొంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రేసమ్మ నాగలక్ష్మి శైలజ లక్ష్మీదేవి వెంకటేశ్వరమ్మ నాగలక్ష్మి మున్ని  బండాలత మేరీ షమీం జీనత్ భాను సుజాత లతా రాణి నిర్మల శకుంతల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *