సిరా న్యూస్,జగ్గయ్యపేట;
జగ్గయ్యపేట లో 22వ రోజు అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ లంతా రెండు జట్లుగా విడిపోయి కబాడీ ఆడారు. జగనన్న మా డిమాండ్లను నెరవేర్చు అంటూ నినాదాలు చేస్తూ కూతకు వెళ్లి జగన్ టీమ్ మొత్తాన్ని అవుట్ చేశారు. జగన్ టీం నుంచి కూతకు వచ్చిన ప్రతి ఒక్కరిని అవుట్ చేసి నిరసన తెలిపారు