సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల జిల్లా సంతమాగులూరులో అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతి లో నిరసన ప్రదర్శన చేపట్టారు.మండలంలోని ఏల్చూరు గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ఎదుట కూర్చొని భోరునవిలపిస్తూ..నిన్ను నమ్మి నీకు ఓటు వేసినందుకు నట్టేట ముంచి ఇబ్బందులకు గురి చేస్తావా అంటూ వారి నినాదాలు చేశారు.పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని కోరారు.