సిరాన్యూస్, బోథ్
వనదేవతలను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే
* అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ములుగు జిల్లాలోని మేడారం లోని సమ్మక్క సారక్కలను శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా వన దేవతలు సమ్మక్క సారక్క లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అమ్మలకు నిలువెత్తు బెల్లం బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.