సిరా న్యూస్, బోథ్
వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ వెంకటరమణ తల్లి మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. ఆమె మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ తుల శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.