సిరాన్యూస్, గుడిహత్నూర్
రిషప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిధార్థ ససానే తనయుడు ఆర్మీ మ్యాన్ కృష్ణ మంగళవారం నిర్వహించిన రిషప్షన్ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ కి కార్యకర్తలే వెన్నుముక అని ఆయన అన్నారు. ఈ రిషప్షన్ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎంపీపీ కేంద్రే జ్ఞనోభా, ఎంపీటీసీ షాగీర్ ఖాన్ మాజీ సర్పంచ్ పవార్ రవినాయక్ సీనియర్ నాయకులు జాదవ్ రమేష్, ముండే మాధవ్, జాదవ్ భీంరావ్, జంగు పటేల్, రంగు శ్రీనివాస్ గౌడ్, ఎం డి గఫార్, తగ్రే ప్రకాష్, ఖలీల్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.