సిరాన్యూస్, బజార్ హత్నూర్
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
* పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలకేంద్రంలో స్థానిక రైతు వేదికలో అర్హులులైన వివిధ గ్రామాలకు చెందిన పదిహేను మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో సర్వశిక్ష అభియాన్ నుండి మంజూరైన నిధులతో మరుగుదొడ్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు.అనంతరం కొల్హరి వంతెన, గ్రామ నూతన గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖ అధికారుల తదితరులు పాల్గొన్నారు.