Anil Jadhav: విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి

సిరా న్యూస్, త‌ల‌మ‌డుగు
విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి
* బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ‌
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల కన్న కలలు, నెరవేర్చి కన్న ఊరికి మంచి పేరు తేవాలని బోథ్‌ శాసనసభ్యులు అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించబోతున్న సైన్స్ ల్యాబ్ కి ఆయన సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ 13.5 లక్షల వ్యయంతో సైన్స్ ల్యాబ్ కోసం భూమి పూజ చేయడం జరిగిందని, పాఠశాల ఆవరణలో స్థలం తక్కువగా ఉండటం చేత గ్రామ వాస్తవ్యులు గ్రామ పెద్దలు చిలుకూరి లక్ష్మారెడ్డి  సైన్స్ ల్యాబ్కి కావలసిన తన వ్యవసాయ భూమిని పాఠశాలకు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని, వారి దాతృత్వానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అభ్యర్థన మేరకు పాఠశాలకు ప్రహరీ గోడ, వంట షెడ్డు నిర్మాణం కూడా చేసి ఇస్తామని అన్నారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు కృష్ణ కుమారి, విలాస్ గౌడ్ దంపతులు అందించిన పరీక్ష ప్యాడ్ లను బహుకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, ఎంఈఓ యూ. నారాయణ మాజీ సర్పంచ్ సాకి ఆనంద్, స్థలదాత చిలుకూరి లక్ష్మారెడ్డి, వెంకట్ రెడ్డి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *