Anil Jadhav: రంజాన్ విందులో పాల్గొన్న‌ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌

సిరాన్యూస్‌, గుడిహత్నూర్
రంజాన్ విందులో పాల్గొన్న‌ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల బీఆర్ ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు షైక్ ఖలీల్ ఆహ్వానం మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌ రంజాన్ విందుకు హాజర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ మాట్లాడుతూ నేల రోజులపాటు కఠోర దీక్షతో ఉపవాసాలు పూర్తి చేసుకొని పరమత సహనాన్ని మాత సమరస్థ్యాన్ని ఆధ్యాత్మికతను చాటే పవిత్ర పండగే రంజాన్ అన్నారు. పవిత్ర పండగను గుడిహత్నూర్ మండల ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండలశాఖ సీనియర్ నాయకులూ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *