anil jadhav started cricket competitions:క్రీడలతోనే మానసికోల్లాసం  బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్.. 

సిరా న్యూస్, బోథ్;

క్రీడలతోనే మానసికోల్లాసం  బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్..

గుడిహత్నూర్ మండల కేంద్రంలో మాన్కపూర్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుమ్రం భీం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే ను మేనేజ్మెంట్ సభ్యలు శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్, బౌలింగ్ చేసి, క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతు… క్రీడలతో మానసికోల్లాసం మెరుగు పడుతుందని, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో ఇటువంటి టోర్నమెంట్ లు దోహద పడతాయని అన్నారు. యువకులు క్రీడల్లో రాణిస్తూనే సమాజా సేవలో ముందుండాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *