సిరాన్యూస్,ఓదెల
జీవులు అంతరించి పోకుండా చూడాలి
* డిప్యూటీ ఎమ్మార్వో సిహెచ్ అనిల్ కుమార్
* ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
ప్రపంచ పిచ్చుకలదినోత్సవం సందర్భంగా ఓదెల మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్యఅతిథిగా ఓదెల డిప్యూటీ ఎమ్మార్వో సిహెచ్ అనిల్ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణంలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించే అధికారం ఉంది.వాటిని కాపాడే బృహత్తర కార్యక్రమం మానవాళిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందట పిచ్చుకల కోసం చిప్పలు ఏర్పాటు చేసి వాటిలో నీరు పోసి పెడితే వాటి దాహం తీర్చిన వారు అవుతామని తెలిపారు.రేడియేషన్ ప్రభావంతో సెల్ టవర్ల యొక్క ప్రభావం వలన కొన్ని జీవులు అంతరించి పోకుండా ఉండాలన్నారు.వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ ఎమ్మార్వోను శాలు కాలువతో సన్మానించినారు.కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మెరుగు భీష్మాచారినేత మండల అధ్యక్షులు డాక్టర్ వేణు , ఉపాధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు .ప్రధాన కార్యదర్శి క్యాతo.వెంకటేశ్వర్లు మెరుగు కవిత సారంగం, క్యాతం. భాగ్యలక్ష్మిమల్లేశం, అల్లం సతీష్ మేరుగు దేవకి, వివేకానంద స్కూల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.