సిరాన్యూస్, అక్కన్నపేట్:
సీడీపీఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి : గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు అనిల్ నాయక్
అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించని సీడీపీఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు అనిల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అంగన్వాడీ టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్కన్నపేట మండలంలో అంగన్వాడీలపై సరైన పర్యవేక్షణ లేక అంగన్వాడీ టీచర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు అనిల్ నాయక్ ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సంపత్, రవీందర్ ఉన్నారు.