విరాళాలు అందించాలని వేడుకోలు
చిగు రుమమిడి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో షష్టి తిథి సందర్భంగా మంగళవారం సుబ్రహ్మణ్యశ్వర స్వామికి, స్వయంభు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీశ్రీ గురూజీ ఉమేష్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు తోచిన విధంగా సహాయం అందించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. హైదరాబాద్,కరీంనగర్, నిజామాబాద్, మెట్ పల్లి, జగిత్యాల, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్, మంచిర్యాల్, కోహెడ, ఎల్కతుర్తి లాంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆక్కు శ్రీనివాస్,లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు గొల్లపల్లి సదాచారి, ఆలయ ధర్మకర్తలు మోహన్ రెడ్డి, తెరాల సత్యనారాయణ, గూడెం లక్ష్మి,తేరాలా అమర్,సునీల్ కుమార్,ప్రవీణ్ కుమార్,కోనేటి సాగర్, పెసరి సంతోష్, బోల్లబత్తిని సంతోష్, బత్తిని సురేందర్,స్వామి, గుంటిపల్లి సంతోష్, మోటం రాజు తదితరులు పాల్గొన్నారు.