సిరా న్యూస్, కుందుర్పి
నేటి మలయనూరులో అంజన్న జాతర వేడుకలు
* ఆలయంలో ఆహ్వాన పత్రికల విడుదల
మండల పరిధిలోని మల్లనూరు గ్రామంలో వెలిసిన అంజన్న స్వామి జాతర వేడుకలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు మలయనూరు గ్రామ నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం గ్రామ సర్పంచ్, గోవిందమ్మ ఓబన్న, ఉప సర్పంచ్, లక్ష్మీపతి, ఎం మాజీ సర్పంచ్, ఎస్.కె, సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ, కెంచమ్మ, భయన్న లు అంజన్న జాతర రథోత్సవ ఆహ్వాన పత్రిక లను ఆలయంలో విడుదల చేశారు. 23న సాయంత్రం గంగపూజ, గణపతి పూజ, సస్తివాసం, రక్షబంధనం, కలిస స్థాపన ,యాగశాల ప్రవేశం, ధ్వజరోహణం, 24న శ్రీవారికి అభిషేకం, ఆకు పూజ ,రథంగా హోమం, పూర్ణాహుతి, బలిహరణం, ఉదయం 10 గంటలకు మహిళల చే జ్యోతుల ప్రదర్శన, మధ్యాహ్నం ఒంటిగంటకు అంజన్న బ్రహ్మ రథోత్సవం, మూడు గంటలకు దూళోచ్చావం, 25న శ్రీవారికి అభిషేకం, వసంతోత్సవం, సాయంత్రం నాలుగు గంటలకు ఉట్ల పరుష తదితర కార్యక్రమాలతో జాతర ముగుస్తుందని తెలిపారు. ఈ జాతరను తిలకించడానికి యావన్మంది భక్తాదులు పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాలని గ్రామ పెద్దలు ,అర్చకుడు , లక్ష్మీకాంత్ లు భక్తాదులను కోరారు.