సిరాన్యూస్, బోథ్
బోథ్ బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు : ఈవో అంజయ్య
ఆదిలాబాద్ జిల్లా బోథ్ బస్టాండ్ లో శుక్రవారం గ్రామపంచాయతీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈవో అంజయ్య ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ పనుల నిమిత్తం మండలంలోని మార్గంలో ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారు కాకుండా ఇతర పనులపై వివిధ ప్రాంతాలను ఎంతోమంది రావడం జరుగుతుందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు చేశామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.