Anju Kumar Reddy: రేపు ఖానాపూర్ కు రాజసింగ్ రాక : జిల్లా అధ్యక్షులు కూనింటీ అంజు కుమార్ రెడ్డి

సిరా న్యూస్, ఖానాపూర్‌
రేపు ఖానాపూర్ కు రాజసింగ్ రాక : జిల్లా అధ్యక్షులు కూనింటీ అంజు కుమార్ రెడ్డి
* ప‌ట్టణంలో భారీ బైక్ ర్యాలీ 

బీజేపీ నేత,గోషామహల్ ఎంఎల్ఏ, హిందూ టైగర్ రాజసింగ్ బుధ‌వారం నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి రానున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం ఖానాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.తెలంగాణలో రాజసింగ్ ప్రజల మద్దతు కూడగట్టుకున్నారని,ఆయన అభిమానులు లక్షల్లో ఉన్నారని తెలిపారు.సాయంత్రం 4 గంటలకు ఖానాపూర్ పట్టణంలోని జంగల్ హనుమాన్ ఆలయం నుండి బస్టాండ్ వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాథోడ్ రితీష్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్,ఖానాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్,అసెంబ్లీ కో కన్వీనర్ నల్లా రవీందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు తోకలా బుచన్న , దాదే మల్లయ్య,మండల ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్, కొండ వేణి రమేష్ ,మండల ఉపాధ్యక్షులు ఏనుగందుల రవి,తగిలేపల్లి జీవన్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *